Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డాక్టర్ రంజిత్ కుమార్
నవతెలంగాణ్బఊ్యరో-హైదరాబాద్
ఉపాధ్యాయ హక్కుల సాధన కోసం, వారి అభివృద్ధి, సంక్షేమం కోసం నిరంతరం పనిచేసే నాయకుడు మాణిక్రెడ్డి అని మోడల్ స్కూల్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ రంజిత్ కుమార్ తెలిపారు. ఈమేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ అభ్యర్థిగా బరిలో ఉన్న మాణిక్రెడ్డిని గెలిపించుకోవాల్సిన అవసరముందని పేర్కొన్నారు. ఆయన్ను గెలిపించడం ద్వారా విద్యారంగం, ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులు, జీవో నెంబర్ 317, పండిట్, జేఎల్, మోడల్ స్కూల్, కస్తూరిబా, గురుకుల ఉపాధ్యాయ సమస్యలపై పోరాడేందుకు ఆయన్ను చట్టసభలకు పంపుదామంటూ పిలుపునిచ్చారు.