Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయడంతోపాటు బీసీల జనగణన చేయాలని మాజీ ఎంపీ వి హనుమంతరావు డిమాండ్ చేశారు. దేశంలో బీసీ క్రిమిలేయర్ ఎత్తేయాలని కోరారు. గురువారం హైదరాబాద్లోని గాంధీభవన్లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. పార్టీ పదవుల్లో వెల్లువెత్తున్న అసంతృప్తిపై పీసీసీ చీఫ్ మాట్లాడాలని కోరారు. బీఆర్ఎస్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో వేచి చూడాల్సిందేనన్నారు. చైనా విషయంలో ఏఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే చొరవ అభినందనీయ మని చెప్పారు. ఈనెల 19న కాంగ్రెస్ వార్ రూమ్ సీజ్పై అన్ని విషయాలు కోర్టుకు తెలియజేస్తామని టీపీసీసీ ఉపాధ్యక్షులు మల్లు రవి చెప్పారు.