Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ ఫుడ్స్ చైర్మెన్ మేడే రాజీవ్సాగర్
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
ఆరోగ్య తెలంగాణ కోసం ఆసియాలోనే అతిపెద్ద ఎక్స్ ట్రూడర్ ప్లాంట్ను ఏర్పాటు చేసినట్టు తెలంగాణ ఫుడ్స్ చైర్మెన్ మేడే రాజీవ్ సాగర్ తెలిపారు. శుక్రవారం నాచారంలోని తెలంగాణ ఫుడ్స్ ఫ్యాక్టరీలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్లాంట్ను రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి, ఎమ్మెల్సీ సురభి వాణి దేవి, ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోషకాహార లోపం లేని తెలంగాణ కోసం కషి చేయడమే తెలంగాణ ఫుడ్స్ లక్ష్యమన్నారు. భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఆధునిక సాంకేతికతతో ఆసియాలోనే అతి పెద్ద ప్లాంట్ను ముఖ్యమంత్రి కేసీఆర్ హాయాంలో ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. మరో 40 ఏళ్ల పాటు డిమాండ్ పెరిగినా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉత్పత్తి జరుగుతుందని వివరించారు. ప్రస్తుతం ఉన్న ప్లాంట్ 1975 లో నిర్మాణమైందనీ, భవిష్యత్ అవసరాల దష్యా నూతన ప్లాంట్ ఏర్పాటు చేశామన్నారు. 18,404 అడుగుల స్థలంలో నిర్మిస్తున్న ఈ ఫ్లాంట్ ద్వారా గంటకు 4 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి జరుగుతుందన్నారు. నిర్మాణం కోసం రూ.42 కోట్లు ఖర్చు చేశామన్నారు. నూతన ప్లాంట్ ద్వారా మన రాష్ట్ర అవసరాలతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, ఛత్తీస్గడ్ రాష్ట్రాలకు పోషకాహారం అందించవచ్చన్నారు. పౌరసరఫరాలశాఖకు ఫోర్టిఫైడ్ బియ్యాన్ని అందించే సామర్ధ్యం కూడా నూతన ప్లాంట్కు ఉందన్నారు. సంస్థ ఉత్పత్తి చేసే బాలామతం, స్నాక్స్ రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 35,699 అంగన్వాడీ సెంటర్ల ద్వారా దాదాపు 15.5 లక్షల మంది లబ్ధిపొందుతున్నారని వివరించారు. ఏపీలోని 55,605 అంగన్వాడీ కేంద్రాల ద్వారా 16.12 లక్షల మందికి పోష్టికాహారం అందుతున్నట్టు వివరించారు.