Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం కేసీఆర్
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
జర్నలిస్టులతో తనది ఉద్యమ సంబంధమనీ, రాష్ట్ర సాధన కోసం సాగిన పోరాటంలో తెలంగాణ జర్నలిస్టుల కషిని గౌరవిస్తూ రాష్ట్ర ప్రభుత్వం వంద కోట్ల నిధిని ఏర్పాటు చేసిందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు అన్నారు. మీడియా అకాడమీ ద్వారా జర్నలిస్టులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటూ వస్తున్నదనన్నారు. అక్రిడిటేషన్లు సహా జర్నలిస్టులకు అందాల్సిన అన్ని సౌకర్యాలను అందిస్తున్నదని, ఏ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టని విధంగా సంక్షేమ కార్యక్రమాలను అమలుచేస్తున్నామని సీఎం కేసిఆర్ గుర్తు చేశారు. భారత రాష్ట్ర సమితి ఏర్పాటు సందర్భంగా అభినందనలు, తమ సంఘీభావం తెలిపేందుకు ఢిల్లీకి వచ్చిన మీడియా అకాడమీ చైర్మెన్ అల్లం నారాయణ, ఇతర జర్నలిస్టులతో సీఎం కేసిఆర్ రెండోరోజు సమావేశమయ్యారు. ఈ సంధర్భంగా జర్నలిస్టులు పలు అంశాలను సీఎం దష్టికి తీసుకెళ్లారు. పలు సమస్యలపై చర్చించారు. సానుకూలంగా స్పందించిన సీఎం కేసిఆర్, ఇంకా ఏవైనా సమస్యలుంటే పరిస్థితులను బట్టి చర్చించి పరిష్కరించుకుందామన్నారు. జర్నలిస్టు విషయాలపై సమన్వయం చేయాలని ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ను సీఎం కేసిఆర్ అదేశించారు.