Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీపీసీసీ పదవులకు రాజీనామా
- మాణిక్కం ఠాగూర్కు 12 మంది నేతల లేఖ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన వారికి పదవులు ఇచ్చారని సీనియర్ నేతలు ఆరోపిస్తున్న నేపథ్యంలో 12 మంది నాయకులు తమ పదవులకు రాజీనామా చేయనున్నట్టు ప్రకటించారు.
ఈమేరకు ఆదివారం కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్కం ఠాగూర్కు లేఖ రాశారు. రాజీనామా చేసిన నేతల్లో వేం నరేందర్రెడ్డి, ఎమ్మెల్యే సీతక్క, విజయరమణారావు, దొమ్మాటి సాంబయ్య, కవ్వంపల్లి సత్యనారాయణ, వజ్రేశ్ యాదవ్, సుభాష్రెడ్డి, చొరగొండ వెంకటేశ్, పటేల్ రమేశ్రెడ్డి, సత్తు మల్లేశ్, చిలుక మధుసూదన్రెడ్డి, శశికళ యాదవరెడ్డి తమ రాజీనామా చేశారు.