Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మహారాష్ట్రలోని నాందేడు ప్రాంతానికి చెందిన దాదాపు 20 మంది బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆదివారం బంజారాహిల్స్లోని రాష్ట్ర హౌం మంత్రి క్వార్టర్లో జరిగిన ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకుడు మహమ్మద్ అఖిల్ నాయకత్వంలో వీరు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో ఎంఎ మాటల్, జావేద్ అహ్మద్, మహమ్మద్ నవీద్, ఉమర్ షేక్, జావేద్ షేక్, మహమ్మద్ నౌమాన్ ,ఫైసల్ తదితరులు పాల్గొన్నారు.