Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డిసెంబర్ 28 నుంచి రైతు బంధు నిధుల విడుదల
- మంత్రి హరీశ్రావుకు సీఎం కేసీఆర్ ఆదేశం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని రైతులకు సీఎం కేసీఆర్ శుభవార్త తెలిపారు. యాసంగి పంట కాలానికి అందించే పెట్టుబడిని రైతుబంధు నిధులను డిసెంబర్ 28 నుంచి విడుదల చేయడం ప్రారంభించాలని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావును ఆదేశించారు. సీఎం ఆదేశాలతో...రైతు బంధు నిధులు, ఎప్పటిలాగే ఒక ఎకరం నుంచి ప్రారంభమై సంక్రాంతి కల్లా రైతులందరి ఖాతాల్లో జమ కానున్నాయి. ఇందుకోసం రూ.7,600 కోట్లను, రైతుల ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం జమ చేయనున్నది. రైతుబంధు దేశానికే ఆదర్శమనీ, పదో విడతతో దాదాపు రూ.66 వేల కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లోకి వెళ్లనున్నాయి.