Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమాచార డైరెక్టర్కి టీడబ్ల్యూజేఎఫ్ వినతి
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులు ఎదుర్కొం టున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర కమిటీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. గత నెల 27న హైదరాబాద్లోని జరిగిన ఫెడరేషన్ రాష్ట్ర ద్వితీయ మహాసభలో ఆమోదించిన పలు తీర్మానాలు, రాష్ట్ర నూతన కార్యవర్గంతో కూడిన వివరాలను ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఎం. సోమయ్య, ప్రధానకార్యదర్శి బి.బసవపున్నయ్య ఆధ్వర్యంలోని ప్రతినిధి బృందం సోమవారం సమాచార శాఖ డైరెక్టర్ బి.రాజమౌళిని కలిసి సమర్పించారు. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న జర్నలిస్టుల ఇండ్లు, ఇండ్లస్థలాల సమస్యలతో పాటు చిన్నపత్రికల సమస్యలు, జర్నలిస్టు బంధు పథకం, పెన్షన్ విధానం, ఆరోగ్య భీమా, అక్రెడిటేషన్ కార్డులు తదితర సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శులు ఎర్రం నర్సింగ్రావు, ఎస్ కే సలీమా, హెచ్యూజే అధ్యక్షులు బి.అరుణ్కుమార్, ఉపాధ్యక్షులు పి. నాగవాణి తదితరులు పాల్గొన్నారు.