Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్టీఏ వెల్లడి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
దేశంలోనే ప్రతిష్టాత్మకమైన ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వ హించే జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జా మినేషన్ (జేఈఈ) అడ్వాన్స్డ్ జూన్ నాలుగో తేదీన జరగ నుంది. ఈ మేరకు నేషనల్ టెస్టిం గ్ ఏజెన్సీ (ఎన్టీఏ) గురువారం షెడ్యూల్ను విడుదల చేసింది. ఈ రాతపరీక్షను ఆన్లైన్లో ఐఐటీ గువాహటి నిర్వహిస్తున్నది. ఏప్రిల్ 30 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది.
వాటి సమర్పణకు గడువు మే నాలుగో తేదీ వరకు ఉంటుంది. మే 29 నుంచి జూన్ నాలుగో తేదీ వరకు అడ్మిట్ కార్డులను అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకునేందుకు అవకాశమున్నది. జేఈఈ అడ్వాన్స్డ్ రాతపరీక్షలు ఆన్లైన్లో జూన్ నాలుగో తేదీన ఉదయం తొమ్మిది నుంచి మధ్యా హ్నం 12 వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు పేపర్-2 జరుగుతాయి. జేఈఈ మెయిన్ నుంచి ఉత్తమ ప్రతిభ కనబరిచిన 2.50 లక్షల మంది అభ్యర్థులు అడ్వాన్స్డ్ పరీక్ష రాసేందుకు అర్హత సాధిస్తారు.