Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తమ భూములను అన్యాక్రాంతం చెసి హత్యా యత్నం చేసినా పొలీసులు పట్టించుకొవడం లేదనీ, రక్షణ కల్పించి తమకు న్యాయం చేయాలని పలువురు బాధితులు అందోళన వ్యక్తం చేశారు. దళిత బహుజన ఫ్రంట్,(డీబీఎఫ్), తెలంగాణా వ్యవసాయ వృత్తిదారుల యూనియన్, జాతీయ అత్యాచారాల నిరోధక ఫోర్స్ అధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలోఎస్సీ, ఎస్టీ అత్యాచార సరవణ చట్టాన్ని సక్రమంగా అమలు చేయాలనీ, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమీషన్కు చైర్మెన్, సభ్యులను నియమించాలని, ముఖ్యమంత్రి అధ్యక్షతన హైపవర్ కమిటీ వేసి దాడులను ఆరికట్టాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర స్దాయి ప్రజా బహిరంగ విచారణ సదస్సు జరిగింది.