Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఇంటర్మీ డియెట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 2023, మార్చిలో జరిగే వార్షిక పరీక్షల ఫీజు ఆలస్య రుసుం రూ.వెయ్యితో చెల్లింపునకు ఈనెల 28 వరకు గడువుందని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శి నవీన్ మిట్టల్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. అయితే షెడ్యూల్ ప్రకారం ఆలస్య రుసుం రూ.వెయ్యితో ఈనెల 22 వరకు ఫీజు చెల్లించేందుకు గడువు ముగిసింది. శుక్రవారం నుంచి రూ.ఐదు వేలతో ఈనెల 28వ తేదీ వరకు అవకాశముందంటూ గతంలోనే ఇంటర్ బోర్డు ప్రకటించింది. అయితే తెలంగాణ ప్రయివేటు జూనియర్ కాలేజీ యాజమాన్యాల సంఘం (టీపీజేఎంఏ) విజ్ఞప్తి మేరకు ఆలస్య రుసుం రూ.వెయ్యితో ఈనెల 28 వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశమిస్తున్నట్టు నవీన్ మిట్టల్ తెలిపారు. కాలేజీల ప్రిన్సిపాళ్లు ఈనెల 28 వరకు ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులతోపాటు ఫెయిలైన వారి నుంచి ఫీజు తీసుకోవాలని కోరారు.