Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
బడుగు బలహీనర్గాలకు న్యాయం చేయడమే కాంగ్రెస్ లక్ష్యమని మాజీ ఎంపీ వి హనుమంతరావు చెప్పారు. ఆ తరగతులను పైకి తీసుకురావడానికి 'హాథ్ సే హాథ్' జోడో యాత్ర చేయాలని నిర్ణయించిందని తెలిపారు. జనవరి 26 నుంచి ప్రియాంక యాత్ర మొదలవుతుందని చెప్పారు. ప్రియాంక గాంధీలో ఇందిరాగాంధీ రక్తం ఉందన్నారు. శనివారం హైదరాబాద్లోని గాంధీభవన్లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. కోకాపేటలో ఎకరం రూ.40 కోట్లకు అమ్ముడు పోయిందనీ, కానీ పేదల భూములు ప్రభుత్వం లాగేసుకుందని విమర్శించారు. పేదలకు న్యాయం చేయాలనీ, వారి భూములను తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. కొకపేట నుంచి కీసర వరకు పాద యాత్ర చేస్తానని తెలిపారు. పదవులు రాలేదని నేతలు పార్టీ మారితే నష్టమనీ, అందుకే ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్లకు న్యాయం చేయాలని దిగ్విజరును కోరినట్టు వెల్లడించారు.