Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లక్కీ డ్రా ద్వారా పోచారం, గాజులరామారం టౌన్షిప్లో ప్లాట్ల కేటాయింపు
- టెండర్లో పాల్గొనే ఔత్సాహికుల నుంచి దరఖాస్తుల స్వీకరణ
- ఈ నెల 30న చివరి గడువు
నవతెలంగాణ - రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
రాజీవ్ స్వగృహ కింద చేపట్టిన పోచారం, గాజులరామారం టౌన్షిప్ నిర్మాణాలు పూర్తి కావడంతో ఈ ప్లాట్లను వేలం వేసేందుకు హెచ్ఎమ్డీఏ ఏర్పాట్లు చేసింది. అందుకు ఔత్సాహికుల నుంచి ప్లాటు ధరలో రెండు శాతం అమౌంట్ మెట్రోపాలిటీ కమిషనర్ హెచ్ఎమ్డీఏ పేరుతో డీడీని ఈ నెల 30 వరకు అందజేయాలని హెచ్ఎమ్డీఏ అధికారులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. లక్కీ డ్రా ద్వారా పారదర్శకంగా ఈ ప్లాట్ల కేటాయింపులు ఉండనున్నట్టు పేర్కొన్నారు.
ప్లాట్ల వివరాలు ఇలా..
పోచారం టౌన్షిప్లో నాలుగు టవర్స్ ఉండగా.. ప్రతి టవర్లో తొమ్మిది ఫ్లోర్లు ఉన్నాయి. ఒక్కో టవర్లో 72 నుంచి 198 ప్లాట్లు ఉన్నాయి. ఇందుకు చదరపు అడుగు ధర రూ.1650 నిర్ణయించారు. గాజులరామారం టౌన్షిప్లో ఐదు టవర్లు ఉండగా ఒక్కో టవర్లో 14 ప్లోర్లు ఉన్నాయి. ఒక్కో టవర్కు 112 ప్లాట్లు ఉండగా ఇందుకు చదరపు అడుగు ధర రూ. 1350, 1650లుగా నిర్ణయించారు.