Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి కేటీఆర్ పిలుపుతో సహకారం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రభుత్వ పాఠశాలకు లండన్కు చెందిన ఓ ఎన్ఆర్ఐ, బీఆర్ఎస్ నాయకుడు రమేష్బాబు ఇస్సంపల్లి సహకారమందించారు. ఆయన సొంతూరు మంచిర్యాల పట్టణ కేంద్రంలోని హమాలీవాడలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల పక్కన ఉన్న ఎనిమిది గుంటల భూమిని విరాళంగా ప్రకటించారు. రాష్ట్ర పురపాలక, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు పిలుపుతో స్ఫూర్తి పొంది ఆయన ఈ సహకారమందించారు. మంగళవారం ప్రగతి భవన్లో తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర, టీవీ, థియేటర్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మెన్ అనిల్ కుర్మాచలంతో ఆయన కలిసి అందుకు సంబంధించిన పత్రాలను రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్కు అందజేశారు. రాష్ట్రంలోని సర్కారు బడులను ప్రయివేట్ పాఠశాలలకు ధీటుగా కార్పొరేట్ తరహాలో విద్యను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ 'మన ఊరు-మనబడి' కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో విదేశాల్లో ఉంటూ తెలంగాణ గడ్డపై చూపిస్తున్న ప్రేమ పట్ల, ఇంతటి బృహత్తరమైన కార్యక్రమంలో పాలు పంచుకున్నందుకు ఎన్ఆర్ఐ రమేష్ను మంత్రి కేటీఆర్ అభినందించారు.