Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నర్సులకు ప్రభుత్వ సహకారం
- సీఎస్ సోమేశ్ కుమార్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
అభివృద్ధి చెందిన దేశాల్లో ఉన్న ఉద్యోగావకాశాలను అందుకునేందుకు నర్సులకు అవసరమైన సహకారం అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. మంగళవారం రాజేంద్రనగర్ గ్రామీణాభివృద్ధి సంస్థలో జపాన్ ఓవర్సీస్ ప్లేస్మెంట్లో ఎంపికైన నర్సుల శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్య రంగంలో దేశ నైపుణ్య రాజధానిగా తెలంగాణను నిలిపేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. ఎంపికైన 25 మంది అభ్యర్థులకు ఆరు నెలల పాటు జపనీస్ భాషతో పాటు నర్సింగ్లో నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నారు. ఆరు నెలల తర్వాత నిర్వహించే పరీక్షలో ఉత్తీర్ణులైన వారు ఏడాదికి రూ.16 లక్షల వేతనం పొందనున్నారు. ఈ కార్యక్రమంలో కార్మిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాణికుముదినీ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.