Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సుగంధ ద్రవ్యాల బోర్డు సభ్యునిగా నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అర్వింద్ ఎన్నికయ్యారు. ఆయనతోపాటు వల్లభనేని బాలశౌరి కూడా సభ్యులు ఎన్నికైనట్టు పార్లమెంట్ మంగళవారం బులిటెన్ విడుదల చేసింది. ఈ సందర్భంగా ఎంపీ అర్వింద్ మాట్లాడుతూ పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికైన ఎనిమిది నెలల కాలంలోనే మోడీ ప్రభుత్వం నిజామాబాద్ కేంద్రంగా ''రీజినల్ ఆఫీస్ కం ఎక్స్టెన్షన్ సెంటర్ '' మంజూరు చేసిందనీ, దాని ద్వారా బోర్డు 30 కోట్ల బడ్జెట్ను 2022-2025 మధ్య మూడేండ్ల కాలానికి ఆమోదించిందని తెలిపారు. 1986 నుంచి 2020 వరకు 35 ఏండ్లలో రానటువంటి బడ్జెట్ను మూడేండ్ల కాలానికి తెచ్చుకున్నామని చెప్పారు. రూ.9 కోట్ల రూపాయల నిధులు విడుదలయ్యాయనీ, బోర్డు సభ్యునిగా ఎన్నికవ్వడం పట్ల ఎంపీ స్పందిస్తూ దీని వలన నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని ప్రాంత పసుపు రైతులకు మరింత సేవ చేసే అవకాశం లభించిందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పసుపు, మిర్చి పంటల రైతుల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా మరింతగా కృషి చేస్తానని పేర్కొన్నారు. బోర్డు సభ్యునిగా తన ఎన్నికకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.