Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎనిమిదేండ్లుగా కేంద్రం నిర్లక్ష్యం : ట్విట్టర్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సహకరించకున్నా.... విద్యా వ్యవస్థలో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని బీఆర్ఎస్ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. ఈ మేరకు మంగళవారం ఆమె ట్వీట్ చేశారు. ఎనిమిదేండ్లుగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పట్ల పూర్తి నిర్లక్ష్యం వహిస్తున్నప్పటికీ సీఎం కేసీఆర్ సారధ్యంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలుస్తోందని తెలిపారు. బాలికల విద్యకు తెలంగాణ స్వర్ణ యుగంగా మారిందని తెలిపారు. పీజీలో 72 శాతం,డిగ్రీలో 52 శాతం, గురుకులాలు, కేజీబీవీల్లో 69 శాతం, బీఈడీ ఫస్టియర్లో 81 శాతం బాలికల అడ్మిషన్లతో, ఉన్నత విద్యలో బాలికల ఎన్రోల్మెంట్ రేషియోలో జాతీయ సగటును మించిన రాష్ట్రం మంచి ఫలితాలను సాధిస్తున్నదని సంతోషం వ్యక్తం చేశారు. మెడికల్ కాలేజీల కేటాయింపులో కూడా కేంద్రం తెలంగాణ పట్ల పూర్తి కక్షపూరితంగా వ్యవహరిస్తున్నదని తెలిపారు. అయినా వైద్య విద్యలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని తెలిపారు. కొత్త విద్యాసంస్థల ఏర్పాటు,మౌలిక వసతుల కల్పనతో, ఉన్నత విద్యలో బాలికలు పెద్ద ఎత్తున చేరుతుండటం గర్వకారణం, సంతోషకరమని పేర్కొన్నారు.