Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం.ఎల్) రెవల్యూషనరీ ఇన్షేటివ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
నారాయణ పేట మరికల్ మండలం చిత్తనూర్ గ్రామంలోని ఇథనాల్ కంపెనీ ప్రజా వ్యతి రేక చర్యలు మానుకోవాలని సీపీఐ(ఎంఎల్) ఇన్షేటీవ్ రాష్ట్ర కార్యదర్శి గడ్డం సదానందం బుధవారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతుల వ్యవసాయ భూములు, సాగునీటి పైపుల ద్వంసం చేస్తున్న ఆ కంపెనీ వ్యతిరేక పోరాట కమిటీ, పరిసర గ్రామాల రైతుల పోరాటాన్ని బలపర్చాలని రైతులకు పిలుపునిచ్చారు. వేలాది మంది రైతుల సాగునీటి పైపులను ధ్వంసం చేయడాన్ని మానుకోవాలని తెలిపారు. అక్రమంగా నిర్మిస్తున్న ఇథనాల్ కంపెనీని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.