Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కేరళ సీఎం పినరరు విజయన్ హైదరాబాద్ చేరుకున్నారు. వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో గురువారం ఖమ్మంలో నిర్వహించబోయే బహిరంగ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొంటారు. అందుకోసం బుధవారం రాత్రి 8గంటలకు హైదరాబాద్కు చేరుకున్నారు. ఆయనకు సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జి.నాగయ్య, జూలకంటి రంగారెడ్డి, డీజీ నర్సింహారావు, ఎస్ వీరయ్య, టి సాగర్ స్వాగతం పలికారు. వ్యవసాయ కార్మిక సంఘం బహిరంగ సభలో పాల్గొనేందుకు వీలుగా విజయన్ గురువారం ఉదయం 11గంటలకు హైదరాబాద్ నుంచి ఖమ్మం బయలు దేరి వెళ్లనున్నారు.