Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైల్వే సహాయ మంత్రి దర్శన్కు గవర్నర్ విజ్ఞప్తి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సిద్ధిపేట జిల్లా కొమరవెల్లి కమాన్ వద్ద రైల్వే హాల్టింగ్ స్టేషన్ ఏర్పాటు చేయాలని రైల్వేశాఖ సహాయ మంత్రి దర్శన విక్రమ జర్దోష్ను రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర రాజన్ కోరారు. గురువారం రాజ్భవన్లో గవర్నర్ తమిళిసైను ఆమె మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా కోవిడ్-19 సమయంలో పెద్దపల్లి జిల్లా కొత్తపల్లి రైల్వేస్టేషన్లో పలు రైళ్ల నిలుపుదలను ఆపేశారనీ, అక్కడి ప్రజలకు అది ఇబ్బందిగా మారిందంటూ గవర్నర్ తెలిపారు.