Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్ర ప్రజలకు సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణపై కక్ష ధోరణితో వ్యవహరిస్తున్నదని శనివారం ఒక ప్రకటనలో విమర్శించారు. తెలంగాణ ప్రజలకు ద్రోహం చేస్తున్నదని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పేర్కొన్న ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేదని పేర్కొన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలు పెంచాలంటూ పార్లమెంటు చెప్పినా కేంద్రం పెంచడం లేదని తెలిపారు. ఈ ఏడాదిలోనైనా తెలంగాణ పట్ల కేంద్రం కక్షపూరిత వైఖరి మానుకుని హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. బీజేపీ నాయకులు, కేంద్ర మంత్రులు తెలంగాణకు రావలసిన నిధుల కోసం, అభివృద్ధి పనుల కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా స్థానిక సంస్థలకు విధులు, నిధులు వెంటనే ఇవ్వాలని, పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.