Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు పెరిగాయంటూ కొన్ని పత్రికలు అసత్య వార్తలను ప్రచురిస్తున్నాయని రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి విమర్శించారు. అవన్నీ తప్పుడు లెక్కలేనని కొట్టి పారేశారు. ఆ వార్తలన్నీ నిరాధారమైనవని చెప్పారు. రాష్ట్రంలో రైతులు సంతోషంగా ఉంటే కొన్ని మీడియా సంస్థలు ఓర్వలేకపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం హైదరాబాద్లోని బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... రైతు బంధు పథకం కింద ఇప్పటికే రూ.65 వేల కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేశామని తెలిపారు.
రైతు బీమాను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని చెప్పారు. ఈ క్రమంలో గతంతో పోలిస్తే 300 శాతం రైతుల ఆత్మహత్యలు తగ్గాయని ఆయన స్పష్టం చేశారు.