Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పదో తరగతి పరీక్షలను 11 నుంచి 6 పేపర్లకు కుదించడం పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి ట్రస్మ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు యాదగిరి శేఖర్రావు, ప్రధాన కార్యదర్శి ఎస్ మధుసూదన్ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. పూర్తి భిన్నమైన సబ్జెక్టులైన ఫిజికల్ సైన్స్, బయలాజికల్ సైన్స్ పరీక్షలను వేర్వేరు తేదీల్లో నిర్వహించాలని కోరారు. ప్రశ్నాపత్రాలలో రెండు, మూడు మార్కుల సెక్షన్లలో అదనపు ప్రశ్నలను జోడించి వాటికి కూడా ఛాయిస్ ఇచ్చేలా చూడాలని తెలిపారు. సమయాభావ పరిస్థితులను అర్థం చేసుకుని నాలుగు మార్కుల ప్రశ్నల సంఖ్య తగ్గించాలని పేర్కొన్నారు.