Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్ర నూతన డీజీపీగా బాధ్యతలు చేపట్టిన అనంతరం అంజనీకుమార్ నేరుగా ప్రగతి భవన్కు వెళ్లి ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిశారు. తనకు రాష్ట్ర డీజీపీగా అవకాశాన్ని ఇచ్చినందుకు ఆయన ముఖ్యమంత్రికి ఈ సందర్భంగా కృతజ్ఞతలను తెలిపారు. ముఖ్యమంత్రి సైతం అంజనీకుమార్ను అభినందిస్తు పోలీసు శాఖ ప్రతిష్టను మరింతగా పెంచాలనీ, శాంతి భద్రతలు, నేరాల అదుపునకు కృషి చేయాలని కోరుతూ శుభాకాంక్షలు చెప్పారు. అక్కడి నుంచి అంజనీకుమార్ రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్లను గౌరవ సూచకంగా కలిశారు.