Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
టీఎస్పీఎస్సీ త్వరలో నిర్వహించబోయే గ్రూప్-2 రాతపరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు ర్యాంకర్లతో ఈనెల నాలుగు నుంచి ఎనిమిదో తేదీ వరకు ఐదురోజులపాటు ఉచిత అవగాహన తరగతులను నిర్వహిస్తున్నట్టు 21వ సెంచరీ ఐఏఎస్ అకాడమి చైర్మెన్ పి క్రిష్ణప్రదీప్ తెలిపారు. ప్రతిరోజూ ఉదయం పది నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు హైదరాబాద్లోని అశోక్నగర్లో ఉండే తమ అకాడమి సెమినార్ హాల్లో నిర్వహిస్తామని ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గ్రూప్-2 అధికారులు ఎస్ రాజు (ఎంపీవో), ఆనంద్కుమార్ (ఏసీటీవో), సాయి స్ఫూర్తి (ఏఎస్వో), డాక్టర్ శాలిని (ఏసీటీవో), శ్రీలతారెడ్డి (ఏఎంవీఐ) తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. పాలిటీ, ఎకానమీ, చరిత్ర, తెలంగాణ ఉద్యమం, సామాజిక నిర్మాణం వంటి అంశాలపై విశ్లేషణాత్మకంగా అవగాహన కల్పిస్తారని పేర్కొన్నారు. గ్రూప్-2 అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.