Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కిసాన్ కాంగ్రెస్ చైర్మెన్ అన్వేష్రెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రైతుల సమస్యల విషయంలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి అహంకారపూరితంగా మాట్లాడుతున్నారని కిసాన్ కాంగ్రెస్ చైర్మెన్ సుంకేన అన్వేష్రెడ్డి విమర్శించారు. మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. పల్లా నోటికి ఏదోస్తే అది మాట్లాడటం సరైందికాదని తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పంటనష్టం పరిహారాన్ని ఇవ్వలేదన్నారు. ఏకకాలంలో రుణమాఫీ చేయకపోవడంతో వడ్డీలు పెెరిగి రైతులపై భారం పడుతున్నదని చెప్పారు. రాష్ట్రంలో దాదాపు 16 లక్షల మంది రైతులు రుణాలు చెల్లించలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. పంటనష్టాన్ని పట్టించుకోలేదంటూ రైతు స్వరాజ్య వేదిక చేస్తున్న విమర్శలను ప్రభుత్వం సమీక్షించుకోవాలని ఆయన సూచించారు.