Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని కాంట్రాక్టు అధ్యాపకులకు మూణ్నెల్లుగా జీతాలు అందడం లేదని కాంట్రాక్టు లెక్చరర్ల ఫోరం (సీఎల్ఎఫ్) జేఏసీ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆ సంఘం కన్వీనర్ సయ్యద్ జబీఉల్లా ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. సకాలంలో జీతాలు రాక కాంట్రాక్టు అధ్యాపకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జీతాలను చెల్లించాలని కోరారు. క్రమబద్ధీకరణ ప్రక్రియ ప్రకటనలకే పరిమితమైందని విమర్శించారు. కొత్త సంవత్సరంలోనైనా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవ తీసుకుని ఆ ప్రక్రియను పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు.