Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 75 కేంద్రాలు ఏర్పాటు: టీఎస్పీఎస్సీ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలో స్త్రీ, శిశు సంక్షేమ అధికారి పోస్టుల భర్తీకి సంబంధించిన రాతపరీక్ష మంగళవారం జరగనుంది. ఈ మేరకు టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. 17 జిల్లాల్లో 75 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ పోస్టులకు 19,812 మంది దరఖాస్తు చేశారని వివరించారు. 13,954 మంది ఇప్పటి వరకు హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకున్నారని పేర్కొన్నారు. మంగళవారం ఉదయం పది నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పేపర్-2 రాతపరీక్షలను నిర్వహిస్తామని వివరించారు. అభ్యర్థులు గంట ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. ఉదయం 9.15, మధ్యాహ్నం 2.15 గంటల తర్వాత పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించబోమని స్పష్టం చేశారు. ఇతర వివరాలకు www.tspsc.gov.in వెబ్సైట్ను సంప్రదించాలని సూచించారు.