Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్టీసీ అభివృద్ధికి సహకరించండి:
- ఉద్యోగులతో ఎమ్డీ సజ్జనార్
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
సమిష్టితత్వం, వినూత్న ఆలోచనలతో ఆర్టీసీని అభివృద్ధిలోకి తీసుకురావాలని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ ఉద్యోగులకు విజ్ఞప్తి చేశారు. ఎవరూ తమ శక్తి సామర్థ్యాలను తక్కువ అంచనా వేసుకోవద్దని చెప్పారు. నూతన సంవత్సరం సందర్భంగా సోమవారం బస్భవన్లో ఆయన కేక్కటింగ్ చేశారు. గత ఏడాది ఆర్టీసీ సిబ్బంది, ప్రయాణికులు ఇచ్చిన సలహాలు, సూచనలతోనే సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు. కొత్త సంవత్సరంలో సంస్థ సాధించాల్సిన అంశాలపై దిశానిర్దేశం చేశారు. సాంకేతికత నుంచి తప్పించుకునే పరిస్థితులు ప్రస్తుతం లేవని, ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ప్రయాణీకులకు మెరుగైన సేవలను అందించాలన్నారు. ఆర్టీసీకి భవిష్యత్లో ఐటీ, ఇంజనీరింగ్ విభాగాలు కీలకం కానున్నాయని తెలిపారు. కార్యక్రమంలో సీవోవో డాక్టర్ రవీందర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు వినోద్ కుమార్, మునిశేఖర్, మెడికల్ అడ్వైజర్ సైదిరెడ్డి, సీఎంఈ రఘునాథ రావు, సీటీఎం జీవన్ప్రసాద్, సీటీఎం (మార్కెటింగ్ అండ్ కమర్షియల్) విజరుకుమార్, సీసీవోఎస్ విజయ భాస్కర్, సి.ఇ (ఐటీ) రాజశేఖర్, సీఎఫ్ఎం విజయపుష్ప తదితరులు పాల్గొన్నారు.