Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అర్ధరాత్రి ఒంటి గంట వరకు మెట్రో సేవలు
నవతెలంగాణ-సిటీబ్యూరో
నాంపల్లి నుమాయిష్ ఎగ్జిబిషన్ నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో రైలు వేళల సమయాన్ని పొడిగించారు. అర్ధరాత్రి ఒంటి గంట వరకు మెట్రో రైళ్లను నడపనున్నట్టు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎల్బీనగర్-మియాపూర్, నాగోల్-రాయదుర్గం మార్గాల్లో సమయం పొడిగించారు. అర్ధరాత్రి 12 గంటలకు చివరి మెట్రో రైళ్లు ప్రారంభమై గంట లోపు గమ్యస్థానానికి చేరుకోనున్నాయి. ఈ మార్పులు ఫిబ్రవరి 15 అర్ధరాత్రి వరకు అమల్లో ఉంటాయని తెలిపారు. అలాగే, నుమాయిష్ రద్దీ దృష్ట్యా గాంధీభవన్ మెట్రో స్టేషన్లో టికెట్ బుకింగ్ కౌంటర్ల సంఖ్యను పెంచినట్టు పేర్కొన్నారు. సాధారణంగా ఉన్న నాలుగు కౌంటర్లతోపాటు మరో రెండు కౌంటర్లను అదనంగా ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.