Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మంత్రి నిరంజన్రెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
మారుతున్న పరిస్థితుల్లో సహకార శాఖ ప్రాధాన్యత ఎంతో పెరిగిందని రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి చెప్పారు. బుధవారం హైదరాబాద్లోని గృహకల్పలో తెలంగాణ సహకార గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన డైరీ, క్యాలెండర్ను మంత్రి ఆవిష్కరించారు. సహకార శాఖ ఉద్యోగులకు నిరంతర శిక్షణ ఇవ్వాలని కోరారు. పెరుగుతున్న సంపద దుర్వినియోగం కాకుండా కాపాడాలని సూచించారు. కేంద్ర సహకార ఉద్యోగుల సంఘం మాజీ నేత నర్సింహారెడ్డి, సంఘం అధ్యక్షులు జగన్మోహన్రావు, అడిషనల్ రిజిస్ట్రార్లు సుమిత్ర, శ్రీనివాసరావు, టీఎన్జీవో ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.