Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో గ్రూప్ -4 పోస్టులకు రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 1,55,022 దరఖాస్తులొచ్చాయి. ఆన్లైన్లో గతనెల 30వ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) కార్యదర్శి అనితా రామచంద్రన్ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈనెల 30న ఒకటి, 31న 19,535, ఈనెల ఒకటిన 13,324, రెండున 40,762, మూడున 30,262, నాలుగున 31,438, ఐదున 19,700 కలిపి మొత్తం 1,55,022 దరఖాస్తులొచ్చాయని వివరించారు. దరఖాస్తుల సమర్పణకు తుది గడువు ఈనెల 19వ తేదీ వరకు ఉందని వివరించారు. 25 ప్రభుత్వ శాఖల పరిధిలో 8,039 గ్రూప్-4 పోస్టుల భర్తీ కోసం టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ను జారీ చేసిన విషయం తెలిసిందే. ఇతర వివరాలకు https://www.tspsc.gov.in వెబ్సైట్ను సంప్రదించాలని సూచించారు.