Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కరీంనగర్కు చెందిన రేగులపాటి కిషన్ రావు (77) అనారోగ్య కారణాలతో గురువారం మరణించారు. ఆయన ఇప్పటికీ నాలుగు నవలలు ఆరు కథా సంకలనాలు 13 కవిత్వ సంకలనాలు వెలువరించారు. సంఘసంస్కరణ అభ్యుదయ భావాలతో ఆయన రచనలు సాగాయి. 1976లో ఆయన రాసిన ఆమె వితంతువు కాదు, 1978లో పతివ్రత ఎవరు, 1981లో సంఘర్షణ, 1982లో ప్రేమకు పెళ్లెప్పుడు అనే నవలలు ఆ కాలంలో గొప్ప పేరు తెచ్చాయి. కిషన్రావు ఈ రకంగా విరివిగా కథలు రాసేవారు. గత ఏడేండ్లుగా అనారోగ్యంతో దాదాపు మంచంపైనే ఉన్నారు. ఆయన సతీమణి రేగులపాటి విజయలక్ష్మి కూడా ఆయన స్ఫూర్తితో రచనలు చేశారు. ఆయన 1946, డిసెంబర్ ఒకటిన ప్రస్తుత రాజన్న సిరిసిల్ల జిల్లాలోని చింతల టానాలో జన్మించారు. 1970 నుంచి 2004 వరకు ఉపాధ్యాయునిగా పనిచేసి కరీంనగర్ రాంనగర్లో స్థిర నివా సం ఏర్పరచుకున్నారు. ఆయన రచనలపై ఒక పీహెచ్డీ కూడా వెలువడింది.
తెలంగాణ సాహితి సంతాపం
ప్రముఖ నవలాకారుడు, కథా రచయిత రేగులపాటి కిషన్రావు మరణం సాహిత్య రంగానికి తీరని లోటని తెలంగాణ సాహితి రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వల్లభాపురం జనార్ధన, కె ఆనందాచారి ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన మరణం పట్ల సంతాపం, కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపారు.