Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కోర్టు అనుమతితో సర్పంచుల సమస్యలపై ఈనెల 9న ఇందిరాపార్కు వద్ద నిర్వహిస్తామని టీపీసీసీ ఉపాధ్యక్షులు చామల కిరణ్కుమార్రెడ్డి చెప్పారు. ఐదు రోజుల క్రితం సర్పంచుల ధర్నాకు పోలీసులు అనుమతి ఇవ్వలేదని తెలిపారు. న్యాయం కోసం కోర్టును ఆశ్రయించగా, శాంతియుతంగా ధర్నాకు అనుమతి ఇచ్చిందని గుర్తు చేశారు. గురువారం హైదరాబాద్లోని గాంధీభవన్లో పార్టీ నేతలతో కలిసి ఆయన విలేకర్లతో మాట్లాడారు. రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన్ చైర్మెన్ సిద్ధేశ్వర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సర్పంచుల సమస్యలను తొక్కి పెట్టేందుకు ప్రయత్నిస్తున్నదని విమర్శించారు.