Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మూసాపేట్ మెట్రో స్టేషన్లో ఘటన
నవతెలంగాణ-కూకట్పల్లి
మెట్రో స్టేషన్లో రన్నింగ్లో ఉన్న రైలుకు ఎదురుగా వెళ్లి అకస్మాత్తుగా దూకి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన హైదరాబాద్లోని కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం జరిగింది. సీఐ నర్సింగ్ రావు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం రాత్రి మూసాపేట్ మెట్రో స్టేషన్ ప్లాట్ ఫామ్ వద్దకు చేరుకున్న ఓ వ్యక్తి రన్నింగ్లో ఉన్న మెట్రో రైలుకు ఎదురుగా వెళ్లి దూకేశాడు. ఈ దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని తీవ్రంగా గాయపడిన అతన్ని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతదేహాన్ని తనిఖీ చేయగా జేబులో రైలు టికెట్ సైతం లేదు. అతని గురించి ఎలాంటి వివరాలు దొరకలేదు. గుర్తు తెలియని శవంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.