Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఆకాశవాణి ఏటా నిర్వహించే జాతీయ సర్వభాషా కవి సమ్మేళనానికి 2023 సంవత్సరానికిగాను తెలుగు భాష నుంచి ఎమ్వీ రామిరెడ్డి ఎంపికయ్యారు. భారతీయ భాషలకు సంబంధించి 23 మంది కవుల కవితల్ని ఆకాశవాణి ఈనెల పదో తేదీన ఢిల్లీలోని రంగ్ భవన్లో రికార్డు చేయనుంది. స్వాతంత్య్రం సాధించి 75 ఏండ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని ఎమ్వీ రామిరెడ్డి రాసిన 'అమృతోపనిషత్' కవితను తెలుగు భాష నుంచి ఎంపిక చేశారు. ఈ కవితను అన్ని భారతీయ భాషల్లోకీ అనువదించి ఆకాశవాణి కేంద్రాల ద్వారా ప్రసారం చేయనున్నారు. కవిగా, కథా రచయితగా ఎమ్వీ రామిరెడ్డి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పటిదాకా మూడు కథా సంపుటాలు, నాలుగు కవితాసంపుటాలను ఆయన ప్రచురించారు. ప్రస్తుతం రామ్కీ ఫౌండేషన్ ప్రెసిడెంటుగా హైదరాబాద్లో పని చేస్తున్నారు. ఆయన స్వగ్రామం గుంటూరు జిల్లా పెదపరిమిలో తండ్రి స్మృత్యర్థం స్థాపించిన 'మువ్వా చినబాపిరెడ్డి మెమోరియల్ ట్రస్టు' ద్వారా పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అదే గ్రామంలో ప్రత్యేకంగా నిర్మించిన భవనంలో వృద్ధాలయంతోపాటు నిరుద్యోగ యువతకు వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని ఆయన నిర్వహిస్తున్నారు.