Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రయివేటు, ఎయిడెడ్, కో ఆపరేటివ్, గురుకులాలు, మోడల్ స్కూళ్లు, కేజీబీవీలు, ఇన్సెంటివ్ జూనియర్ కాలేజీలకు ఈనెల 14వ తేదీ నుంచి సర్కారు సంక్రాంతి సెలవులను ప్రకటించింది. ఈ మేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శి నవీన్ మిట్టల్ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ, ప్రయివేటు, ఎయిడె డ్ జూనియర్ కాలేజీలు, గురుకులాలు, మోడల్ స్కూళ్లు, కేజీబీవీలకు ఈనెల 14 నుంచి 16వ తేదీ వరకు సంక్రాంతి సెలవులుంటాయని స్పష్టం చేశారు. ఈనెల 17న కాలేజీలు పున:ప్రారంభమవుతాయని తెలిపారు. కాలేజీల ప్రిన్సిపాళ్లు ఈ షెడ్యూల్ను అమలు చేయాలని కోరారు. సెలవుల్లో తరగతులను నిర్వహించొద్దని ప్రయివేటు జూనియర్ కాలేజీ యాజమాన్యాలను ఆదేశించారు.