Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేశ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కార్మికులు, ఉద్యోగులు, రైతులు, వ్యవసాయ కూలీలు, పెన్షనర్లు, ప్రజలందరూ కలిసి ఐక్యపోరాటాలు చేయడం ద్వారానే సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేశ్ అన్నారు. శనివారం హైదరాబాద్లో తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ డైరీ, క్యాలెండర్లను ఆయన ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..కార్పొరేట్ సంస్థల ప్రయోజనాలే పర మావధిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని విమర్శించారు. శ్రా మిక వర్గ పోరాటాలకు పెన్షనర్ల సంఘాలు మద్దతివ్వాలని విజ్ఞప్తి చేశారు. ఆలిండియా పెన్షనర్ల సంఘం నాయకులు యంఎన్రెడ్డి మాట్లా డుతూ..ప్రజలకు సాంఘిక భద్రత కల్పించాల్సిన కేంద్ర ప్రభుత్వం వాటిని తిరగదోడుతున్నదని విమర్శించారు. నూతన పెన్షన్ విధానం సరిగాద న్నారు. ప్రజాపంపిణీ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నదన్నారు. తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మచ్చా రంగయ్య మాట్లాడుతూ.. స్వయం ప్రతిపత్తిగల సీబీఐ, ఈడీ, న్యాయవ్యవస్థల పనివిధానంలో జోక్యం చేసుకుంటూ ప్రజాస్వామ్య విరు ద్ధంగా ప్రవర్తిస్తున్నదని విమర్శించారు. సీనియర్ సిటిజన్లకు రైలు ప్రయా ణంలో ఇచ్చే రాయితీలను కూడా ఎత్తేయడం దుర్మార్గమన్నారు. ఈ కార్యక్ర మంలో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పాలకుర్తి కృష్ణమూర్తి, ఉప ప్రధాన కార్యదర్శి సోమయ్య, జీటీ గోపాల్రావు, ప్రభాకర్నాయర్, పాల్గొన్నారు.