Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం కేసీఆర్ నిర్ణయం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ఖమ్మం జిల్లాల్లో బీఆర్ఎస్ భారీ బహిరంగసభ నిర్వహించనుంది. బీఆర్ఎస్ జాతీయ పార్టీగా మారిన తర్వాత మొట్ట మొదటి సారిగా నిర్వహించనుండటంతో భారీ ఏర్పాటు చేస్తున్నది. ఖమ్మం జిల్లా మంత్రి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితర కీలక నేతలు సోమవారం ప్రగతి భవన్లో బీఆర్ఎస్ అధ్యక్షులు, సీఎం కేసీఆర్ను కలిశారు. తెలంగాణలో జరగనున్న మొట్టమొదటి బీఆర్ఎస్ సభను విజయవంతం చేసేందుకు కృషి చేయాలని సీఎం కేసీఆర్ జిల్లా నేతలకు సూచించారు.
ఈ సమావేశంలో మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, హరీశ్రావు, వేముల ప్రశాంత్రెడ్డి, ఎంపీలు నామా నాగేశ్వరరావు, బండి పార్థసారథిరెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, తాతా మధు, ఎమ్మెల్యేలు హరిప్రియ నాయక్, రేగా కాంతారావు, కందాల ఉపేందర్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, లావుడ్యా రాములు నాయక్, ఖమ్మం జెడ్పీ చైర్మెన్ లింగాల కమల్రాజు, తదితరులు ఉన్నారు.