Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
రాష్ట్రంలో తెలుగుదేశం భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని కోరుతూ ఆ పార్టీ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ దశ మహా విద్యాపూర్వక నవ ఛండీయాగ మహోత్సవం నిర్వహిస్తున్నారు. మంగళవారం ఉదయం నుంచి మధ్యాహ్నాం వరకు చేపట్టనున్నారు. తెలుగు ప్రజలకు శుభం కలగాంటూ ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఎన్టీఆర్భవన్లో ఈ యాగం జరగనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను సోమవారం కాసాని జ్ఞానేశ్వర్ స్వయంగా పరిశీలించనున్నారు. ఈ యాగంలో కాసాని కుటుంబ సభ్యులతోపాటు టీడీపీ సీనియర్ నాయకులు, ఇతరులు పాల్గొననున్నారు. తెలుగు రాష్ట్రాల్లో టీడీపీకి ఉన్న అవరోధాలు తొలగిపోవాలని కోరుకుంటూ ఛండీయాగం నిర్వహిస్తున్నట్టు కాసాని సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఎన్టీఆర్ వర్థంతి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు.