Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్పై తాము మొదటి నుంచి ఫిర్యాదు చేస్తున్నామని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు మహేష్కుమార్ గౌడ్ తెలిపారు. ఇక్కడ ఉన్న వాళ్ళను కాదని ఏపీ క్యాడర్ అధికారిని సీఎస్ చేయడం ఏంటని ప్రశ్నించారు. మంగళవారం హైదరాబాద్లోని గాంధీభవన్లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. కొందరు అధికారులు కేసీఆర్ అడుగులకు మడుగులొత్తుతున్నారని చెప్పారు. వరుసగా రెండు రోజులపాటు నేతలతో సమావేశాలు ఉంటాయన్నారు. పీఏసీ, ఎగ్జిక్యూటివ్ కమిటీ, డీసీసీ నేతలతో, వివిధ కమిటీలతో ఆయన మాట్లాడుతారని పేర్కొన్నారు. అనుబంధ సంఘాల నేతలతో కూడా సమావేశమవుతారని వివరించారు. అన్ని నియోజకవర్గాల్లో కేసీఆర్,కేటీఆర్ దిష్టిబొమ్మలు దహనంచేయాలని పిలుపునిచ్చారు.