Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బ్రాహ్మణ సంఘాలది అనవసర రాద్దాంతం: కేజీకేఎస్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
నీరాకు వేదామృతం అని పేరుపెడితే తప్పేంటని కల్లుగీత కార్మిక సంఘం (కేజీకేఎస్) రాష్ట్ర అధ్యక్షులు ఎంవి రమణ ప్రశ్నించారు.ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు.స్వచ్ఛమైన ప్రకృతి పానీయం నీరాకు వేదామృతం అని పేరు పెడితే వేదాలను కించపరిచినట్టు ఎలా అవుతుందని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నీరా కేఫ్ త్వరలో ప్రారంభం కానున్నదని తెలిపారు. ప్రకృతి సిద్ధంగా తాటి, ఈత చెట్లనుండి సూర్యరశ్మి రాకముందే తీసే స్వచ్ఛమైన పానీయమే నీరా అని పేర్కొన్నారు. దీన్ని బాటిళ్లలో, ప్యాకెట్లలో నింపి వినియోగదారులకు అంద జేయనున్నారని తెలిపారు.