Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
కర్నాటక రాష్ట్రం హుబ్బిలిలో జరగనున్న 26వ జాతీయ యువజనోత్సవాల్లో భాగంగా రాష్ట్ర స్థాయి తెలంగాణ కబడ్డీ జట్టు హైదరాబాద్కు చెందిన డి.అఖిల్ కుమార్ ఎంపికయ్యాడు. ఈనెల 10వ తేదీన జింఖానా గ్రౌండ్స్లో రాష్ట్ర కబడ్డీ జట్టు ఎంపికలు జిల్లా యువజన, క్రీడా అధికారి ఎన్.సుధాకర్రావు పర్యవేక్షణలో జరిగాయి. ఈ సందర్భంగా అఖిల్ కుమార్ మాట్లాడుతూ.. తన కోచ్ సుధాకర్రావు పర్యవేక్షణలో శిక్షణ పొంది ఎన్నో మెళకువలు నేర్చుకున్నానని.. కోచ్ సహకారంతో జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి జూనియర్ కబడ్డీ పోటీల్లో పాల్గొని రాష్ట్రానికి ఎంతో పేరు ప్రఖ్యాతిని తీసుకువస్తానని చెప్పారు. జాతీయ స్థాయి యువజనోత్సవాలలో భాగంగా రాష్ట్ర స్థాయిలో తనకు చోటు లభించడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. తన ప్రదర్శనతో తెలంగాణ రాష్ట్రానికి, హైదరాబాద్ జిల్లాకు మంచి పేరు తెస్తానని చెప్పారు.