Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి : నగర శివార్లలోని బాలనగర్ ప్రాంతంలో గల కొన్ని రసాయనిక ఫ్యాక్టరీలలో ఆదాయపు పన్ను (ఐటీ) అధికారులు గురువారం ఆకస్మిక సోదాలను నిర్వహించారు. ముఖ్యంగా, బాలనగర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో గల నాలుగు నుంచి ఐదు ఫ్యాక్టరీలలో సోదాలను సాగించినట్టు సమాచారం. పెద్ద ఎత్తున ఆదాయపు పన్నును ఎగవేశారనే ఆరోపణలపై కొందరు ఫ్యాక్టరీ యజమానుల కార్యాలయాలు, నివాసాలను ఐటీ అధికారులు సోదాలు నిర్వహించి వారి బ్యాంకు అకౌంట్లను, ఆదాయపు పన్ను వివరాలను సేకరించినట్టు తెలిసింది.