Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రయివేటు, ఎయిడెడ్ పాఠశాలలకు శుక్రవారం నుంచి సంక్రాంతి సెలవులను ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకు సంబంధించి అకడమిక్ క్యాలెండర్లోనే సర్కారు వెల్లడించింది. ఈనెల 17 వరకు ఈ సెలవులుంటాయి. 18న తరగతులు ప్రారంభమవుతాయి. శనివారం నుంచి జూనియర్ కాలేజీలకు ఇంటర్ బోర్డు సెలవులను ప్రకటించింది. అవి 16 వరకు కొనసాగుతాయి. 17న జూనియర్ కాలేజీల్లో తరగతులు ప్రారంభమవుతాయి. అయితే జూనియర్ కాలేజీలకు ఈనెల 14న రెండో శనివారం, 15న ఆదివారంపోగా 16న సోమవారం మాత్రమే ప్రభుత్వం సెలవు ప్రకటించిందంటూ విద్యార్థులు, అధ్యాపకులు వాపోతుండడం గమనార్హం.