Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
భారత్ జాగృతి ఆధ్వర్యంలో శనివారం ఉదయం ఐదు గంటలకు కేబీఆర్ పార్కు వద్ద భోగి వేడుకలు జరగనున్నాయి. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈ వేడుకల్లో పాల్గొంటారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలు, గంగిరెద్దుల ఆటలతో భోగి వేడుకలు నిర్వహించనున్నారు.
కవితను కలిసి ఏపీ బీఆర్ఎస్ నేతలు
బీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు తోట చంద్రశేఖర్, రాష్ట్ర నాయకులు రావెల కిషోర్ బాబు, పార్థసారధి,దాసోజు శ్రవణ్ తదితరులు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో సమావేశమయ్యారు. శనివారం హైదరాబాద్లోని కవిత నివాసంలో వారు మర్యాదపూర్వకంగా కలిసారు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు.