Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో -హైదరాబాద్
ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి సంక్రాంతి సెలవులు ఇవ్వకుండా తరగతులు నిర్బంధంగా నడుపుతున్న శ్రీచైతన్య, నారాయణ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేసింది. ఈ మేరకు శుక్రవారం ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ఆర్.ఎల్.మూర్తి, రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజు ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి సెలవు లు విద్యాసంస్థలకు 14 నుంచి 16వ తేదీ వరకు ప్రకటించిం దని గుర్తుచేశారు. అయినప్పటికీ కార్పొరేట్ విద్యా సంస్థలు విద్యార్ధులను బలవంతంగా క్యాంపస్లలోనే ఉంచి తల్లి దండ్రులు వచ్చిన సెలవులు ఇవ్వడం లేదని విమర్శించారు.