Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిథి -హైదరాబాద్
ఛనాక - కొరాటకు బ్యారేజీకి పర్యావరణ అనుమతులు లభించాయి. ఈ మేరకు కేంద్ర పర్యావరణ - అటవీశాఖ ఉత్తర్వులను శుక్రవారం జారీ చేసింది. అనుమతుల సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర జలవనరుల శాఖకు అధికారికంగా పంపింది. ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే ఆదిలాబాద్ జిల్లా తాంసీ, బేలా మండలాల్లోని 50 వేల ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉన్నట్టు సాగునీటి శాఖ అధికారులు తెలిపారు.