Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్ర శాసన సభాపతి శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రజలకు మకర సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. భోగభాగ్యాలతో ''భోగి''ని, సకల సంపదలతో ''సంక్రాంతి''ని, కన్నుల పండుగగా ''కనుమ''ను జరుపుకోవాలని కోరారు. సంక్రాంతి రైతుల పండుగ. వానాకాలం పంటల కోతలు పూర్తయి ధాన్యం ఇంటికి చేరిన సమయంలో జరుపుకునే పండుగ సంక్రాంతి. భోగి మంటలు, గాలి పటాల సందళ్ళతో పాటుగా తెలంగాణ సంప్రదాయ సకినాల పిండివంటలతో ఈ మూడు రోజులు కోలాహలంగా ఉంటుంది. ప్రజలందరూ తమ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి సంక్రాంతి పండుగను ఆనందంగా జరుపుకోవాలని పోచారం కోరారు.