Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భోగి వేడుకల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రతికూల ఆలోచనలను వదిలేసి, దేశం కోసం, సమాజం కోసం పాటుపడదామంటూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. శనివారం హైదరాబాద్లోని కేబీఆర్ పార్కు వద్ద భారత జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన భోగి వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ పాత ఆలోచనలను భోగి మంటల్లో కాల్చేసి, సరికొత్త విధానాలతో ముందుకెళ్లాలని సూచించారు. తెలంగాణ జాగృతి, భారత జాగృతిగా రూపొందిన తర్వాత మొట్టమొదటి కార్యక్రమంగా సంక్రాంతి సంబరాలు చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. హరిదాసులు, బసవన్నల దీవెనలతో భారతదేశం వర్దిల్లాలని ఆకాంక్షించారు. శతాబ్దాల క్రితం మారిషస్కు వెళ్లి అక్కడ స్థిరపడిన తెలుగు సమాజం ప్రతినిధులు ఈ కార్యక్రమంలో అతిథులుగా పాల్గొన్నారు. మారిషస్లో తెలుగుసంస్కృతిని కాపాడేందుకు తరతరాలుగా కృషి చేస్తున్న మారిషస్ తెలుగు సంఘం ప్రతినిధులకు, అక్కడ నిర్వహించనున్న తెలుగు మహాసభలకు సహకారం ఉంటుందని కవిత తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎస్ ఫుడ్స్ కార్పొరేషన్ చైర్మెన్ మేడె రాజీవ్ సాగర్, భారత్ జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి, బీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ యాదవ్, భారత్ జాగృతి హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు అనంతుల ప్రశాంత్, మారిషస్ తెలుగు మహాసభ ప్రతినిధులు పాల్గొన్నారు.